Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అత్భుతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వార్డు నెంబర్ 26, రైసా మసీద్ సమీపంలో మేనక థియేటర్ వెనుకవైపు ఉన్న హబీబ్ నగర్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నాయకులు హరూన్ రషీద్, హంజా రషీద్, షారుఖ్, ఫిరోజ్, అజీజ్, షేక్ మస్తాన్, ఖాజా బేగం, రజియా బేగం, నూర్జహాన్ బేగం, జైనా బేగం సహా సుమారు 100 మంది బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ వాజీద్ ఆధ్వర్యంలో మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో అధికార పార్టీలో చేరారు. కొందరు అభివృద్ధి నిరోధకులు ఎన్నికలప్పుడు వచ్చి కులం, మతం పేరిట ప్రజలను అయోమయానికి గురిచేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి 2014 వరకు నుంచి మహబూబ్ నగర్ అభివృద్ధిని గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని... రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి వినోద్, పట్టణ మైనారిటీ విభాగం అధ్యక్షుడు మోసిన్, జహంగీర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. హజ్ యాత్రకు వెళుతున్న మోసిన్ ను సన్మానించిన మంత్రి.. త్వరలో హజ్ యాత్రకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ పట్టణ మైనారిటీ విభాగం అధ్యక్షుడు మోసిన్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు.
Admin
Abhi9 News