Thursday, 08 January 2026 02:32:13 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో హన్వాడ మండల బిజెపి ప్రధాన కార్యదర్శి నంబి వేణుగోపాల్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీలో చేరిక

Date : 28 June 2023 12:32 PM Views : 574

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని హన్వాడ మండల బిజెపి ప్రధాన కార్యదర్శి నంబి వేణుగోపాల్ యాదవ్ BRS పార్టీ లో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ గత 70 ఏళ్ల నుండి అభివృద్ధికి దూరంగా ఉన్న మహబూబ్ నగర్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం పట్ల, BRS పార్టీ విధానాల పట్ల ఆకర్షితులై బిజెపి పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో పార్టీలో చేరినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నిరంతర విద్యుత్తు దళిత బంధు రైతు బంధు రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, గ్రామాల అభివృద్ధి కి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఇద్దరు రాష్ట్రాలకు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు. క్రమశిక్షణతో పార్టీలో పని చేస్తే పార్టీలో ఎంతో భవిష్యత్తు ఉంటుందన్నారు. నంబి వేణుగోపాల్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీలో చేరినందుకు ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా నంబి వేణుగోపాల్ యాదవ్ కు బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో హన్వాడ మండల మాజీ ఎంపీపీ వడ్ల శేఖర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ కృష్ణయ్య గౌడ్, మండల కో ఆప్షన్ సభ్యులు MD మన్నన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాఘవేందర్ రెడ్డి, సాయిలు, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :