Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ ను సమస్యలు లేని పట్టణంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక క్రీడలు యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కోయిల్ కొండ ఎక్స్ రోడ్డులో స్థానిక కౌన్సిలర్ కోట్ల నర్సింహులు యాదవ్ తో కలిసి వార్డు సమస్యలపై పర్యటన చేపట్టారు. స్థానికులు తెలిపిన సమస్యలను అక్కడికక్కడే అధికారుల దృష్టికి తీసుకుపోయి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.100 శాతం సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపడతామన్నారు. కోయిల్ కొండ చౌరస్తా తో పాటు స్థానిక ప్రాథమిక పాఠశాల వద్ద రూ. 3లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన హై మాస్ట్ లైట్లను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతన్న యాదవ్, వైస్ చైర్మన్ గణేష్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News