Abhi9 News - తెలంగాణ / వనపర్తి : ఘనపూర్ లో శౌర్య జాగరణ యాత్ర బజరంగ్దళ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని హనుమాన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వాడవాడలో హనుమాన్, శ్రీరాముని శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త బజరంగ్దళ్ అధ్యక్షులు హర్షవర్ధన్, హైదరాబాద్ నుండి మూడు రాష్ట్రాల ప్రచారక్, కుమారస్వామి వనపర్తి పట్టణ బీజేపీ అధ్యక్షులు బచ్చు రాము, వనపర్తి పట్టణ ఉపాధ్యక్షులు పిఎం రాము గారు పాల్గొనడం జరిగింది శౌర్య జాగరణ యాత్ర ఘనపూర్ లో ప్రారంభమై అన్ని మండల కేంద్రాల్లో పెద్దమందడి గోపాల్పేట్ కొత్తకోట వనపర్తి లో ఎనిమిదో తేదీనాడు సాయంత్రం ఐదు గంటలకు రాజీవ్ చౌరస్తాలో ముగిస్తుంది ఈ శౌర్య జాగరణయాత్ర దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బజరంగ్దళ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశ్యం హిందువులలో రోజురోజుకు పెరుగుతున్న ధన కొన్ని వర్గాల వారు హిందూ మహిళలను లవ్ జిహాద్ పేరిట ప్రేమించి వారిని కఠినంగా శిక్షిస్తున్నారు హిందువుల జాతిని కాపాడుకోవడానికి భారతదేశ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని తెలిపారు.
Admin
Abhi9 News