Saturday, 13 June 2026 04:58:28 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

జిల్లా కలెక్టర్ రవి నాయక్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం

Date : 26 June 2023 02:53 PM Views : 240

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ కోరారు. పాలనా పరమైన కారణాల వల్ల గత మూడు వారాలుగా నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం తిరిగి ఈ సోమవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పిర్యాదుదారులు వచ్చి వారి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ కు సమర్పించారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భూములకు సంబంధించిన ఫిర్యాదులు, అలాగే ఇతర అంశాలకు సంబంధించి మండల స్థాయిలో పరిష్కారమయ్యే ఫిర్యాదుల పై సంబంధిత మండలాల తహసిల్దార్లు ,ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ సదరు ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అదేవిధంగా జిల్లా అధికారులకు సంబంధించిన ఫిర్యాదులపై ప్రత్యేకంగా జిల్లా అధికారిని తన వద్దకు పిలిపించుకొని ప్రజలు సమర్పించిన ఫిర్యాదులపై తక్షణం చర్య తీసుకోవాలని, ఈ విషయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ప్రజావాణిలో మధ్యాహ్నం 2 గంటల వరకు పిర్యాదుదారులు వారి ఫిర్యాదులను సమర్పిస్తూనే ఉన్నారు .కొన్ని ఫిర్యాదులు అక్కడే పరిష్కరించగా, మరికొన్నిటి పై ఎండార్స్ చేస్తూ ఆ ఫిర్యాదు పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు.ఈ సోమవారం సైతం ఎప్పటిలాగే భూములకు సంబంధించిన ఫిర్యాదులు, వ్యక్తిగత అంశాలు, తదితర అంశాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.ఈ ప్రజావాణి కార్యక్రమానికి స్థానిక సంస్థలు, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డిఆర్డిఓ యాదయ్య, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ తో పాటు, జిల్లా అధికారులందరూ హాజరై ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :