Saturday, 18 April 2026 06:45:44 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిబిఐ విచారణ జరగాలి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్

షాద్ నగర్ పర్యటనలో ఎంపీడీకే అరుణ సంచలన వ్యాఖ్యలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధం ఉన్నవారిని గుర్తించాలి భార్య భర్తల మధ్య కూడా సంభాషణలు వింటారా

Date : 23 June 2025 12:24 PM Views : 199

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా దారుణమని దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కమ్మదనం గ్రామంలో బిజెపి బూత్ కార్యకర్తల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఎంపీ డీకే అరుణ వెంట రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పతంగి రాజగోపాల్ గౌడ్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, అందే బాబయ్య తదితర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీకే అరుణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ టాపింగ్ వ్యవహారం చాలా అసమంజసనీయమని ఆమె అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గతం నుండి ఫిర్యాదులు చేస్తూనే వచ్చామని గుర్తు చేశారు. భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణలు కూడా రికార్డు చేశారని ఇది కూడా చాలా దుర్మార్గమని డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఒకరి పూర్తి స్వేచ్ఛను హరించడమే ఈ ట్యాపింగ్ వ్యవహారం అని ఆమె స్పష్టం చేశారు. రాజకీయ కారణాలు చెప్పి మామూలు కార్యకర్త ఫోన్ నంబర్లను కూడా ట్యాపింగ్ చేయడం దారుణమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ప్రాంతాల్లో ట్యాపింగ్ జరిగాయో దీని వెనుక ఎవరున్నారు వారు బయటకు రావాలంటే దీనిపై సిబిఐ విచారణ జరగాలని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. లేకపోతే కేసును సిబిఐకి అప్పజెప్పాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, చెంది మహేందర్ రెడ్డి దేపల్లి అశోక్ గౌడ్ మోహన్సింగ్, విజయభాస్కర్ ఇస్నాతి శ్రీనివాస్ చేగు సుధాకర్ చెట్ల వెంకటేష్ వంశీకృష్ణ పేట అశోక్ రంగన్న గౌడ్ లష్కర్ నాయక్ అనిల్ గౌడ్ శ్రీరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :