Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : సిగరెట్ మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం 2003 పై ఈరోజు జిల్లాస్థాయి అధికారుల సమన్వయ సమావేశము కలెక్టరేట్ IDOC హాలులో జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కె. సీతారామరావు అదనపు కలెక్టర్ విచ్చేసి ఈ చట్టంపై వివిధ శాఖలు నిర్వహించవలసిన పాత్రల గురించి వివరించారు. గతంలో బస్సులలో ప్రయాణించాలంటే పొగ త్రాగే వారి వల్ల ఇబ్బంది కలిగేదని, పొగ త్రాగరాదు, ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రచారం చేయడం వల్ల ఇప్పుడు చాలా వరకు తగ్గిందని తెలిపారు. పొగ తాగ టాన్ని యువకులు ఒక ఫ్యాషన్ గా భావించి అలవాటు పడతారని, సినిమాలు చూసి హీరో మాధిరి పొగ తాగాలని చూస్తారని,స్కూల్, కళాశాల విద్యార్థులు మొదటగా అలవాటు పడతారు. ఈ మధ్య సిగరెట్లలో డ్రగ్స్ పెట్టుకొని పొగ పీలుస్తున్నారు,ఇది ఒక రకంగా డబ్బులు ఇచ్చి జబ్బు తెచ్చుకోవడం వంటిది అని హెచ్చరించారు. రైతులకు పొగాకు పంటలకు బదులుగా ఇతర పంటలు పండించేటట్లు ప్రోత్సహించాలని తెలిపారు. సీసీ కుంట మండల పరిధిలో తయారవుతున్న బీడి కట్టలపై తప్పకుండ పుర్రె బొమ్మలు ఉండేటట్టు చూడాలని సూచించారు.ప్రతి పాఠశాలలో, కళాశాలలో పొగతాగడం వల్ల కలిగే అనర్థాల గురించి ఒక ఫ్లెక్సీ బోర్డు ఉంచాలని తెలిపారు.ఇది ఒక ఆరోగ్యశాఖనే కాకుండా అన్ని శాఖల సమన్వయంతో మాత్రమే పొగ తాగడం మరియు ఇతర రకాలుగా పొగాకు వాడకాన్ని నిలువరించగలమని తెలిపారు.మన జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ వారు దాదాపుగా ఆరు లక్షల 80 వేల దాకా ఫైన్లు వేసి చలానా కట్టించడం మంచి పని అని అభినందించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణ DMHO , డాక్టర్ భాస్కర్ నాయక్ Dy DMHO ,డాక్టర్ సంధ్యాకిరణ్మై, ఎయిమ్స్ నుండి డాక్టర్ కిషోర్ రాష్ట్ర COTPA అధికారి డాక్టర్ శ్రావణ్ , శ్రీనివాసులు డిఎస్పీ రహమాన్ వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Abhi9 News