Thursday, 08 January 2026 02:50:01 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల పేరు తో మోసం చేస్తున్న కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం

Date : 23 June 2023 04:14 PM Views : 408

Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు, ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ భారీ ప్రదర్శన తో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ 10 తలలు దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ఆర్డీవో కి వినతి పత్రాలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రోగ్రాం ఇంచార్జ్ డా.మొగుళ్ళ అశోక్ గౌడ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర మహిళా కార్యదర్శి కాటమోని తిరుపతమ్మ కృష్ణయ్య గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చి తొమ్మిదేళ్ల అయినా రాష్ట్రప్రభుత్వం మాత్రం ఈ నెల 2వ తేదీ నుండి 22 వ తేదీ వరకు ప్రజా ధనాన్ని దుర్వినియోగపరుస్తూ తన పార్టీ ప్రచారానికి దశాబ్ది ఉత్సవాలను జరుపుతుంది. నీళ్లు, నిధులు, నియామకాలలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా యావత్ తెలంగాణ సమాజం జరిపిన పోరాటాలతోపాటు స్వరాష్ట్ర సాధన కోసం 1200 మందికి పైగా ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ సాధిస్తే గద్దెనెక్కిన కేసీఆర్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లు దాటినా ఆశయ సాధన దిశగా చేసిందేమీ లేదు. మిగులు బడ్జెట్తో లభించిన రాష్ట్రం నేడు ఐదు లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పుల పాలయిందంటే ఈ అప్పుల పాపానికి పూర్తి బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదే. గత ప్రభుత్వాలకు ముందుచూపు ఉన్నందునే అనేక సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. తెలంగాణలో ఇవ్వాళున్న ప్రతి ప్రాజెక్టు గత ప్రభుత్వాలు చేపట్టినవే. 90 శాతం పనులు పూర్తి చేసినవే. ఈ తొమ్మిదేళ్లలో ఉన్న ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు పిల్ల కాలువలు తవ్వించి నీరందించలేని ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వాలను విమర్శించే హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల పేరుమీద రూపకల్పన చేసిన ప్రాజెక్టును నీ ధనదాహానికి పరాకాష్ఠగా కాళేశ్వరం పేరు మీద లోపభూయిష్టంగా రీ-డిజైన్ చేసి లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారు అని అన్నారు...ఈ కార్యక్రమంలో నేషనల్ ఓబిసి కోఆర్డినేటర్ కేతూరి వెంకటేష్ టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రంగినేనీ జగదీశ్వర్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు రాము యాదవ్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాటమోని కృష్ణయ్య గౌడ్ , తాలూకా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ గటౌన్ అధ్యక్షులు కాంతారావు ,అన్ని మండలాల అధ్యక్షులు పరశురాం , తగిలి కృష్ణయ్య శాంతయ్య నరసింహ , బీరయ్య మధుసూదన్ రెడ్డి శేఖర్ యాదవ్ అన్ని మండలాల యూత్ కాంగ్రెస్ నాయకులు, మరియు సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :