Thursday, 08 January 2026 03:10:08 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

రాజీ మార్గమే... రాజ మార్గం : జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్

జూన్ 14వ తేదీ వరకు జరుగుతున్న "జాతీయ లోక్ అదాలత్"ను సద్వినియోగం చేసుకోండి

Date : 10 June 2025 08:37 PM Views : 74

Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవితకాలం కొనసాగుతాయి...ఒకవేళ ఇంతటితో కలిసుంటామని ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడే అవి సమసిపోతాయని రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లాలో వివిధ రకాల రాజీపడదగు కేసులలోని కక్షీదారులకు విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసారు. ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జూన్ 14.06.2025 వ తారీఖు వరకు నారాయణపేట, కోస్గి కోర్టులలో "నేషనల్ లోక్ అదాలత్" సందర్భంగా కక్షీదారులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. మీకు తెలిసిన వాళ్లపై ఏమైనా కేసులు ఉంటే వాటిని రాజీ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులను పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుందని అన్నారు. యాక్సిడెంట్ కేసులు, కొట్టుకున్న కేసులు, చీటింగ్ కేసులు, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్న చిన్న దొంగతనం కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మరియు ఇతర రాజీ పడదగు కేసులలో ఈ నేషనల్ లోక్ అదాలత్లో రాజీ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చని ఎస్పీ అన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని కేసులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరని కోరారు. దీనికోసం ఫిర్యాదు దారుడు మరియు నేరస్తులు అందరూ తమ యొక్క ఆధార్ కార్డు తీసుకుని సంబంధిత కోర్ట్/ప్రదేశంలో హాజరుకావాలని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ లో జిల్లా వ్యాప్తంగా బాధితులకు మంచి అవకాశం అని దిని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తెలిపారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :