Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ చట్టాలను చేతుల్లోకి తీసుకొని నేరాలకు పాల్పడకుండా చట్ట పరిధిలో నడుచుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి సూచించారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా జైలును సందర్శించి న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా బడ్జి మాట్లాడుతూ నేరాల అదుపుకు ఖైదీల సహకారం అవసరమన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. రాజీమార్గంలో పరిష్కరించుకునే కేసులకు సంబంధించి పై కోర్టుల్లో సైతం ఆపిల్ ఉండదని అన్నారు. పోక్సో చట్టం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పనితీరు, లీగల్ సర్వీసెస్ యాక్ట్ వంటి విషయాలపై చర్చించారు. ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్షణికా వేషాలకు లోనై కేసుల్లో ఇరుక్కోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జైల్ సూపరింటెండెంట్ వెంకటేశం, జైలర్ శ్రీనివాసులు, డాక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు...
Admin
Abhi9 News