Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : బీఆర్ఎస్ మహబూబ్ నగర్ అభ్యర్థి, మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మంత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాంమందిర్ చౌరస్తా నుంచి ఆయన ఎన్నికల ప్రచారం ప్రరంభించారు. చౌరస్తాలో ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద మంత్రి టీ తయారు చేశారు. అనంతరం రోడ్డు పక్కన విక్రయిస్తున్న సీతాఫలాలను కొనుగోలు చేశారు. తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న అన్ని దుకాణాల వద్దకు వెళ్ళి వారికి చేసిన అభివృద్ధిని వివరించి... భవిష్యత్తులో మరింత పురోభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. జిల్లా కేంద్రంలో అన్ని రకాల వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ మందిర్ చౌరస్తా, పాన్ చౌరస్తా, క్లాక్ టవర్ వద్ద మంత్రి ప్రచారానికి అడుగడుగునా అనూహ్య స్పందన లభించింది. వ్యాపారాలు ఇంత బాగా జరుగుతున్నాయంటే మంత్రి చేసిన అభివృద్ధియే కారణమని వ్యాపారులు తెలిపారు. తాము బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.
Admin
Abhi9 News