Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : బిఆర్ఎస్ అసమర్థ పాలన వల్ల నీటి పంపకాల్లో పాలమూరుకు అన్యాయం జరిగిందనీ, నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణను నిలువునా దోచుకుంటున్నారనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు.... మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం కరెంట్ కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయనీ విమర్శించారు... గతంలో కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగ విద్యుత్ సరఫరా చేశామని ఇప్పుడు అది పూర్తిగా తొలగించారని మండిపడ్డారు.. రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ నాయకులు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు.. 60 శాతం నికర జలాలు పాలమూరులో వున్నాయనీ, ఇక్కడ కృష్ణా నది పారుతున్నప్పటికి రైతులకు నీరు అందడంలేదన్నారు... ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై కేసీఅర్ ఒక్కరోజైనా రివ్యూ చేశారా అని దుయ్యబట్టారు... రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ ఊచిత కరెంట్ ఇచ్చిందనీ అది బిఆర్ఎస్ పార్టీ మరచిపోయిందన్నారు.. కాంగ్రెస్ హయాంలో 400 కేవి సబ్ స్టేషన్ ను తెచ్చింది తానేనని తెలిపారు... బిఆర్ ఎస్ నాయకులు ఎంతసేపు కాళేశ్వరం పైనే మాట్లాడుతారు తప్ప పాలమూరు ప్రాజెక్టులపై నోరుమెదపరని అన్నారు... రిడిజైన్ ల పేరుతో ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందన్నారు.. 24 గంటల విద్యుత్ ఎక్కడ ఇస్తున్నారో దమ్ముంటే కేటీఆర్, హరీష్ రావు చర్చకు రావాలని సవాల్ విసిరారు... సోనియాగాంధీ కాళ్ళకు దండం పెట్టిన కేసీఅర్ నేడు కాంగ్రెస్ కు తెలంగాణకు సంబంధం లేదని ఎలా చెప్తాడనీ పేర్కొన్నారు... అబ్ కె బాద్ కిసాన్ సర్కార్ అంటున్న కేసీఅర్ ముందు తెలంగాణ రైతులను సరిగ్గా చూసుకోవాలన్నారు... తెలంగాణ సర్కార్ వచ్చాకా ఒక్క ప్రాజెక్ట్ టెండర్ కూడా పారదర్శకంగా జరగలేదన్నారు.
Admin
Abhi9 News