Abhi9 News - తెలంగాణ / వనపర్తి : జిల్లా పరిధిలో అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వనపర్తి జిల్లా పరిధిలో ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇక్కడ ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు, విక్రయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు జిల్లాలో అనుమతి లేకుండా ఇసుకను తరలించడం, అక్రమంగా నిల్వ చేయడం వంటి కార్యకలాపాలను నిరోధించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో దాడులు చేసి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ (PDPP) చట్టం, మైన్స్ అండ్ మినరల్స్ చట్టం (Mines and Minerals Act) ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి ప్రభుత్వ అనుమతులున్న వారికి మాత్రమే ఇసుక రవాణా చేయడానికి , విక్రయించేందుకు హక్కు ఉందని, ఇతరులెవరైనా ఇసుక రవాణాకు పాల్పడితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా గురించి ప్రజలు సమాచారం అందించాలని, 100, లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 6303923200 నెంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఇసుక అక్రమ రవాణా అక్రమ డంపింగ్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్రమ రవాణా అక్రమ డంపింగ్ చేసే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.
Admin
Abhi9 News