Abhi9 News - తెలంగాణ / వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పరిధిలోని 26,29,33వ వార్డులలో తిరుగుతూ పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సంద్భంగా కలెక్టర్ పారిశుధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను సైతం అడిగి తెలుసుకున్నారు. ఉదయాన్నే తడి పొడి చెత్త వేరు వేరుగా సేకరించాలని, ఎవరైనా ఇళ్ళ నుండి తమ చెత్తను, ప్లాస్టిక్ ను మురుగు కాలువలో పడేస్తే అలాంటి వారిని గుర్తించి అపరాధ రుసుము వసూలు చేయాలని సూచించారు. పారిశుధ్య కార్మికులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, 15రోజులకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి 15 రోజులకు మునిసిపాలిటీ ఆవరణంలోనే హెల్త్ క్యాంపు పెడతామని, అక్కడే వైద్య పరీక్షలు చేసుకోవాలన్నారు. ప్రతినెల జీతం పడుతుందా లేదా అనీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ భవనాన్ని, టౌన్ హాల్, లలితకళా తోరణం భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని, నాణ్యతలో లోపం లేకుండా చూసుకోవాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపాలిటీ కమిషనర్ విక్రమ్ సింహ రెడ్డి తదితరులు కలెక్టర్ వెంట పాల్గొన్నారు.
Admin
Abhi9 News