Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్లో అన్నదాతలు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. యూరియా కొరత లేదని అధికారులు అంటున్నారని, ఒకసారి కేంద్రాల వద్దకు వచ్చి చూడాలని ఫైర్ అవుతున్నారు. 'మాకు ఈ గోస ఏంది సారూ' అంటూ వాపోతున్నారు. కాగా యూరియా సమస్య కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని కాంగ్రెసోళ్లు, రాష్ట్ర ప్రభుత్వం చూడాలని బీజేపీ వాళ్లు అంటున్నారని, మొత్తం మీద రైతులు ఆగమవుతున్నారని నేతలు మండిపడుతున్నారు.
Admin
Abhi9 News