Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో CDPO రోజాను సస్పెండ్ చేయాలని సోమవారం తాసిల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లు రెండవ సారి రిలే దీక్షలు చేపట్టారు. వారు వర్షాన్ని లెక్కచేయకుండా గొడుగులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ CDPO ను సస్పెండ్ చేసేంతవరకు విధులకు హాజరుకామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ CDPO కు జిల్లా అధికారుల సహకరిస్తున్నారని వెంటనే వారిని సస్పెండ్ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు...
Admin
Abhi9 News