Thursday, 08 January 2026 02:37:55 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

భారత జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి ప్రజల అవసరాలను, శాంతిభద్రతలను కాపాడాలి మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుల

Date : 15 July 2023 02:21 PM Views : 138

Abhi9 News - తెలంగాణ / సూర్యాపేట : మణిపూర్ రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించాలని మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని రాఘవ ప్లాజా వద్ద నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అలజడుల గురించి భారత జాతీయ మహిళా సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఆనిరాజా తో సహా నిజనిర్ధారణ కమిటీ నిస్సా సిద్దు, స్వతంత్ర న్యాయవాది దీక్ష దీవిలపై నిజ నిర్ధారణ కమిటీ కోసం అక్కడికి వెళితే మణిపూర్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై చర్యలు తీసుకొని శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల వల్ల సామాన్య ప్రజలకు తినడానికి తిండి లేక అనేక విధాలుగా నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. అక్కడికి వెళ్లిన మహిళా సమాఖ్య అధ్యక్షులపై అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు ఎత్తి వేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మణిపూర్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షురాలు అనంతుల మల్లీశ్వరి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుప్పతల కోటమ్మ, దేవరం మల్లీశ్వరి, ఎల్లావుల ఉమా, పొన్నం వెంకటమ్మ, భాగ్య, ఎల్లావుల సీత, మంగమ్మ ,పద్మ, సుజాత, అమృత, రుద్రమ్మ, లక్ష్మమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :