Thursday, 08 January 2026 02:39:40 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

లోక్ అదాలత్ కు భారీ స్పందన - జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్

జిల్లాలో మొత్తం 2816 కేసుల పరిష్కారం, జరిమానా 4,10,000/చెల్లించారు. 137 ఎఫ్ఐఆర్,1953 ఈ పెట్టి, 726 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పరిష్కారం. లోక్ అదాలత్

Date : 14 June 2025 07:51 PM Views : 170

Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : జూన్ 14న జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి జిల్లా ప్రజల నుండి భారీ స్పందన వచ్చిందని జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపిఎస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ లోక్ అదాలత్ కార్యక్రమంలో పరిష్కరించిన కేసుల వివరాలను వెల్లడించారు. రాజీమార్గమే రాజమార్గం అంటూ జిల్లా ప్రజలు విశేష స్పందనను చూయించి రాజి కుదుర్చుకొని ఇరు వర్గాల కాక్షి దారులు విజయవంతంగా కేసులను పూర్తి చేసుకున్నారని తెలిపారు. జిల్లాలోని 12 పోలీసు స్టేషన్లలో పరిష్కరించబడిన కేసులు మొత్తం 2816 కేసులుగా గుర్తించబడినదని తెలిపారు. ఇందులో ఐపిసి కేసులు 137 పరిష్కరించగా, 1953 ఈ పెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 726 ఉండగా వాటికి ఫైన్ విధించినట్లు తెలియజేశారు. మొత్తం జరిమానా 4,10,000/- చెల్లించడం జరిగిందని తెలిపారు. ఎఫ్ఐఆర్ కేసులలో ఈ పెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, మరియు ఎక్సైజ్ కేసులు, నేర నిరూపణ ఉన్న నిందితులు స్వయంగా న్యాయస్థానాలకు హాజరై తప్పులను ఒప్పుకోవడంతో ఈ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కొట్లాట, భార్యాభర్తల మధ్య గల వివాహ సంబంధమైన వివాదములు, అత్తింటి వారి వేధింపులు, అన్ని రకాల క్రిమినల్ కేసులు, నిందితులు బాధితులు కలిసి హాజరై రాజీమార్గంలో రాజీ పడటంతో కేసులను కొట్టివేసినట్లు తెలిపారు. కేసులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తూ విధులను నిర్వర్తించిన కోర్టు డ్యూటీ అధికారులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పోలీసు వ్యవస్థతో వివిధ సమావేశాలు ఏర్పాటు చేస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు గారిని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సీనియర్ సివిల్ జడ్జ్ విద్యా నాయక్ గారిని పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కో డ్యూటీ ఆఫీసర్స్ ని పోలీస్ అధికారులు, సిబ్బందిని తదితరులను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :