Saturday, 13 June 2026 05:18:58 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

లోక్ అదాలత్ కు భారీ స్పందన - జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్

జిల్లాలో మొత్తం 2816 కేసుల పరిష్కారం, జరిమానా 4,10,000/చెల్లించారు. 137 ఎఫ్ఐఆర్,1953 ఈ పెట్టి, 726 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పరిష్కారం. లోక్ అదాలత్

Date : 14 June 2025 07:51 PM Views : 279

Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : జూన్ 14న జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి జిల్లా ప్రజల నుండి భారీ స్పందన వచ్చిందని జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపిఎస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ లోక్ అదాలత్ కార్యక్రమంలో పరిష్కరించిన కేసుల వివరాలను వెల్లడించారు. రాజీమార్గమే రాజమార్గం అంటూ జిల్లా ప్రజలు విశేష స్పందనను చూయించి రాజి కుదుర్చుకొని ఇరు వర్గాల కాక్షి దారులు విజయవంతంగా కేసులను పూర్తి చేసుకున్నారని తెలిపారు. జిల్లాలోని 12 పోలీసు స్టేషన్లలో పరిష్కరించబడిన కేసులు మొత్తం 2816 కేసులుగా గుర్తించబడినదని తెలిపారు. ఇందులో ఐపిసి కేసులు 137 పరిష్కరించగా, 1953 ఈ పెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 726 ఉండగా వాటికి ఫైన్ విధించినట్లు తెలియజేశారు. మొత్తం జరిమానా 4,10,000/- చెల్లించడం జరిగిందని తెలిపారు. ఎఫ్ఐఆర్ కేసులలో ఈ పెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, మరియు ఎక్సైజ్ కేసులు, నేర నిరూపణ ఉన్న నిందితులు స్వయంగా న్యాయస్థానాలకు హాజరై తప్పులను ఒప్పుకోవడంతో ఈ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కొట్లాట, భార్యాభర్తల మధ్య గల వివాహ సంబంధమైన వివాదములు, అత్తింటి వారి వేధింపులు, అన్ని రకాల క్రిమినల్ కేసులు, నిందితులు బాధితులు కలిసి హాజరై రాజీమార్గంలో రాజీ పడటంతో కేసులను కొట్టివేసినట్లు తెలిపారు. కేసులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తూ విధులను నిర్వర్తించిన కోర్టు డ్యూటీ అధికారులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పోలీసు వ్యవస్థతో వివిధ సమావేశాలు ఏర్పాటు చేస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు గారిని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సీనియర్ సివిల్ జడ్జ్ విద్యా నాయక్ గారిని పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కో డ్యూటీ ఆఫీసర్స్ ని పోలీస్ అధికారులు, సిబ్బందిని తదితరులను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :