Saturday, 18 April 2026 05:15:37 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

మత్తు పదార్థాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది... జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్

Date : 26 July 2023 04:44 PM Views : 225

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మత్తు పదార్థాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ అన్నారు. బుధవారం ఆయన తన చాంబర్లో నిర్వహించిన మత్తు పదార్థాల నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడుతూ గాంజా ఇతర మత్తు పదార్థాల వల్ల యువత పాడైపోవడమే కాకుండా కుటుంబాలు సైతం ఎన్నో ఇబ్బందులకు గురవుతాయని, అందువల్ల జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో గాంజా ,మత్తు పదార్థాల రవాణా,సరఫరా, వంటివి నూటికి నూరు శాతం అరికట్టాలని తెలిపారు. ఇందుకుగాను అన్ని శాఖల సమన్వయంతో గాంజాతో పాటు, ఇతర మతపదార్థాలను అరికట్టాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకించి అన్ని శాఖలు మత్తుపదార్థాల నివారణ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. జిల్లా ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటివరకు పెద్ద ఎత్తున గాంజా నిల్వ ఉంచటం, రవాణా చేయటం, అమ్మటం వంటి కేసులు తమ దృష్టికి రాలేదని అయితే ఇటీవల రైల్వే స్టేషన్ తదితరచోట్ల చిన్న చిన్న పాకెట్లలో గాంజా వంటివి అమ్ముతున్నట్లు తమ దృష్టికి రాగానే సంబంధిత వ్యక్తులను గుర్తించి పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. గాంజా ఇతర మత్తుపదార్థాల నివారణకు సంబంధిత శాఖల సమన్వయంతో కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.గాంజా ఏ రూపంలో ఉన్న ఉక్కుపాదంతో అణిచివేయాలని ఆయన అన్నారు ఏఎస్పి రాములు, ఎక్సైజ్ సూపరింటిండెంట్ సైదులు, డి ఎఫ్ ఓ సత్యనారాయణ ,డిఎస్పి మహేష్ ,ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :