Thursday, 08 January 2026 02:35:32 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

సియం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Date : 19 June 2025 02:17 PM Views : 110

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : సియం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ అర్బన్ మండలానికి చెందిన లబ్ధిదారులకు సియం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా పేద ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేశారని, కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించడం తో పాటు ఐదు లక్షల రూపాయలు ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల అభ్యున్నతికి కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈరోజు 78 మంది లబ్ధిదారులకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశామని, వాటి విలువ 72 లక్షలు ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారే పల్లి సురేందర్ రెడ్డి, ఓబిసి ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు హన్మంతు, ప్రశాంత్, అంజద్, మోసిన్, రషేద్, నాయకులు లీడర్ రఘు, చర్ల శ్రీనివాసులు, మోయిజ్, అశ్వాక్ తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :