Saturday, 18 April 2026 06:46:11 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

సియం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Date : 19 June 2025 02:17 PM Views : 187

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : సియం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ అర్బన్ మండలానికి చెందిన లబ్ధిదారులకు సియం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా పేద ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేశారని, కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించడం తో పాటు ఐదు లక్షల రూపాయలు ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల అభ్యున్నతికి కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈరోజు 78 మంది లబ్ధిదారులకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశామని, వాటి విలువ 72 లక్షలు ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారే పల్లి సురేందర్ రెడ్డి, ఓబిసి ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు హన్మంతు, ప్రశాంత్, అంజద్, మోసిన్, రషేద్, నాయకులు లీడర్ రఘు, చర్ల శ్రీనివాసులు, మోయిజ్, అశ్వాక్ తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :