Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : బిల్లు లు రాలేదని స్కూల్ కి తాళం వేసిన కాంట్రాక్టర్... మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని బొల్లారం గ్రామంలో మన ఊరి మనబడి కార్యక్రమం ద్వారా భాగంగా అదనపు తరగతి గదులు నిర్మించడానికి 29 లక్షల 99 వేల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ పనులు చేయడానికి బొల్లారం గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి 2022 జూన్ లో అనుమతులు పొందాడు.అప్పు చేసి మరీ అదనపు తరగతి గదులను నిర్మించాడు. పనులు పూర్తయి స్కూలు ప్రారంభమైన 19 లక్షలు మాత్రమే చెల్లించారని ఇంకా 10 లక్షలు రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదన్నారు. తాను అప్పుచేసి మరి పనులు పూర్తి చేశాను. ఇప్పుడు అప్పుల ఇచ్చినవారు తిరిగి చెల్లించాలని కాంట్రాక్టర్ పై ఒత్తిడి తేవడంతో తరగతి గదులకు తాళం వేశాడు. స్కూల్ కు వచ్చిన విద్యార్థులకు వరండాలో కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులు...
Admin
Abhi9 News