Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : హైదరాబాద్ నుండి డోన్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు బోగీలు ఒక్కసారిగా విడిపోవడంతో పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల రైల్వే స్టేషన్ లో రెండవ ప్లాట్ ఫామ్ పై నుండి డోన్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు బోగీలు ఒక్కసారిగా విడిపోయాయి. దీంతో రైల్వేస్టేషన్లో ఉన్న ప్రయాణికులు ఈ ఘటనను చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇంజన్ ముందు భాగానికి కొన్ని బోగీలు, వెనక భాగానికి మరికొన్ని బోగీలు విడిపోవడంతో రైల్వే స్టేషన్ అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాగా ట్రైన్ బ్రేకులు వేయడంతో దీంతో భోగిలమధ్య ఉన్న లాక్ ఒక్కసారిగా ఓపెన్ కావడంతో బోగీలు విడిపోయాయి. గమనించిన ట్రైన్ పైలెట్ ఒక్కసారిగా అప్రమత్తమై ట్రైన్ ను నిలిపివేసి మరమ్మతులు నిర్వహించిన అనంతరం విడిపోయిన భోగిలను తిరిగి ట్రైన్ కు తగిలించుకొని డోన్ వైపు వెళ్ళింది. ఇదిలా ఉండగా ఇటీవల ఒడిస్సా రాష్ట్రంలో జరిగిన ఘటన మరొక ముందే తాజాగా జడ్చర్లలో రైలు ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల ప్రజలు భయాందోళనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Admin
Abhi9 News