Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా (24,713) కేసులు పరిష్కరించారు. ఈ కేసుల పరిష్కారం కోసం మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో 5 బెంచీలను మరియు జడ్చర్ల కోర్టులో 2 బెంచీలను ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం - "రాజీ మార్గమే రాజ మార్గం" జిల్లా జడ్జి కొర్టు లో మోటర్ వెహికిల్ యాక్సి డెంట్ కేసును నష్ట పరిహారం కోసం కక్షిదారులు దాఖలు చేసినారు. ఈ కేసు నెం.457/2024 లో నష్ట పరిహారం Rs.50,00,000/- గాను ప్రతివాది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారి మధ్య అంగీకారం ప్రకారం Rs.33,00,000/- రాజీ మార్గంలో పరిష్కరించడం జరిగింది. కక్షిదారుల న్యాయవాది అశోక్ గౌడ్ అవార్డును కక్షిదారులకు జిల్లా జడ్జి బి.పాపిరెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మూడవ అదనపు జిల్లా జడ్జి (ఫ్యామిలీ కోర్టు) శ్రీమతి R.శ్రీదేవి, జడ్జి పోక్సో కోర్టు శ్రీమతి T. రాజా రాజేశ్వరి, వి. ఈశ్వరయ్య, FAC కార్యదర్శి, జిల్లా న్యాయ సేవా సంస్థ, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. రాధిక, స్పెషల్ JMFC మొబైల్ కోర్ట్ జడ్జి శ్రీ మహమ్మద్ మునావర్ హుస్సేన్, శ్రీ ఎ. రవి శంకర్ స్పెషల్ JMFC Excise కోర్ట్ జడ్జి మరియు 4 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం. ఎస్ కె.భావన, ,2nd క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి నిర్మల, శశిధర్, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) P. వెంకటేశ్వర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ G.V.రమణ రెడ్డి, ఇన్సూరెన్స్ అడ్వకేట్స్, స్టాండింగ్ కౌన్సిల్స్, లోక్ అదాలత్ మెంబర్స్, కక్షిదారులు, అడ్వకేట్స్, Para Legal Volunteers మరియు అన్ని బ్యాంకుల సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News