Thursday, 08 January 2026 02:33:35 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసుల (24,713 ) పరిష్కారం

Date : 14 June 2025 07:35 PM Views : 92

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా (24,713) కేసులు పరిష్కరించారు. ఈ కేసుల పరిష్కారం కోసం మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో 5 బెంచీలను మరియు జడ్చర్ల కోర్టులో 2 బెంచీలను ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం - "రాజీ మార్గమే రాజ మార్గం" జిల్లా జడ్జి కొర్టు లో మోటర్ వెహికిల్ యాక్సి డెంట్ కేసును నష్ట పరిహారం కోసం కక్షిదారులు దాఖలు చేసినారు. ఈ కేసు నెం.457/2024 లో నష్ట పరిహారం Rs.50,00,000/- గాను ప్రతివాది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారి మధ్య అంగీకారం ప్రకారం Rs.33,00,000/- రాజీ మార్గంలో పరిష్కరించడం జరిగింది. కక్షిదారుల న్యాయవాది అశోక్ గౌడ్ అవార్డును కక్షిదారులకు జిల్లా జడ్జి బి.పాపిరెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మూడవ అదనపు జిల్లా జడ్జి (ఫ్యామిలీ కోర్టు) శ్రీమతి R.శ్రీదేవి, జడ్జి పోక్సో కోర్టు శ్రీమతి T. రాజా రాజేశ్వరి, వి. ఈశ్వరయ్య, FAC కార్యదర్శి, జిల్లా న్యాయ సేవా సంస్థ, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. రాధిక, స్పెషల్ JMFC మొబైల్ కోర్ట్ జడ్జి శ్రీ మహమ్మద్ మునావర్ హుస్సేన్, శ్రీ ఎ. రవి శంకర్ స్పెషల్ JMFC Excise కోర్ట్ జడ్జి మరియు 4 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం. ఎస్ కె.భావన, ,2nd క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి నిర్మల, శశిధర్, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) P. వెంకటేశ్వర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ G.V.రమణ రెడ్డి, ఇన్సూరెన్స్ అడ్వకేట్స్, స్టాండింగ్ కౌన్సిల్స్, లోక్ అదాలత్ మెంబర్స్, కక్షిదారులు, అడ్వకేట్స్, Para Legal Volunteers మరియు అన్ని బ్యాంకుల సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :