Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : గ్రామ పంచాయతీ కార్మికులు గత పది రోజుల నుంచి సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు జే. చంద్రశేఖర్ అన్నారు. జిల్లా కేంద్రం మండల పరిషత్ ఆఫీసు ఎదుట సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు శనివారం యువజన కాంగ్రెస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. గ్రామాల్లో కార్మికుల సేవలు గొప్పవని అన్నారు. కార్మికులకు ఎంత జీతం ఇచ్చినా తక్కువేనని అన్నారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అన్నారు. కార్మికులు గత పది రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించలేని మంత్రి మల్లారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహబూబ్ నగర్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర యాదవ్, చంద్రమౌళి, నరేష్ బాబు, రఘు, నరేష్ గౌడ్, మొహమ్మద్ జాకీర్, రమేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు
Admin
Abhi9 News