Thursday, 08 January 2026 02:52:11 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

బర్త్‌డే బంప్స్ ఘటనలో సీఐపై బదిలీ వేటు

సీఐని బదిలీ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ

Date : 18 September 2025 08:29 PM Views : 148

Abhi9 News - తెలంగాణ / Hyderabad : హైద‌రాబాద్ : ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ విద్యార్థిపై దాడి ఘ‌ట‌న‌లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై నాచారం సీఐపై ప్ర‌భుత్వం బ‌దిలీ వేటు వేసింది. పుట్టిన రోజున బ‌ర్త్ డే బంప్స్ పేరిట తోటి విద్యార్థులు చేసిన వికృత చేష్ట‌ల‌తో ఓ బాలుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. కొత్త‌పేట‌కు చెందిన విద్యార్థి(14) నాచారంలోని ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్‌లో 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. అయితే ఆగ‌స్టు 29వ తేదీన స‌ద‌రు విద్యార్థి పుట్టిన రోజు కావ‌డంతో.. తోటి ఫ్రెండ్స్ లంచ్ స‌మ‌యంలో స‌ర‌దాగా చేసిన చేష్ట‌ల‌తో ఆ విద్యార్థి మ‌ర్మంగానికి గాయ‌మై ర‌క్త‌స్రావ‌మైంది. విష‌యం తెలుసుకున్న స్కూల్ ప్రిన్సిప‌ల్ హుటాహుటిన బాధిత విద్యార్థిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం పేరెంట్స్‌కు స‌మాచారం అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. విద్యార్థికి స‌ర్జ‌రీ చేయ‌డంతో ప్రాణ‌పాయం త‌ప్పింది. అయితే విద్యార్థి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా దాడి చేసిన విద్యార్థులపై, పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్ల‌క్ష్యం వ‌హించారు. దీంతో నాచారం సీఐని బదిలీ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సీఐ రుద్వేర్ కుమార్ స్థానంలో కొత్త సీఐగా ధనుంజయ్‌ను నియ‌మించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :