Thursday, 08 January 2026 02:48:59 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

సర్వీస్ రివాల్వర్‌నే అమ్మేసిన ఎస్‌ఐ..

Date : 27 November 2025 08:33 AM Views : 91

Abhi9 News - తెలంగాణ / Hyderabad : హైదరాబాద్‌ మహానగరం పరిధిలోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న భానుప్రకాష్‌ వ్యవహారం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. దర్యాప్తు అధికారి చేయకూడని అక్రమాలకు పాల్పడటంతో మొత్తం శాఖ ప్రతిష్ట దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. 2020 బ్యాచ్‌కు చెందిన భానుప్రకాష్‌ ఇటీవల 4 తులాల బంగారం చోరీ కేసును విచారించాడు. రికవరీ చేసిన బంగారాన్ని బాధితులకు అప్పగించకుండా.. త్వరలో ఇస్తా అని నమ్మబలికి, లోక్‌ అదాలత్‌లో ఇరు వర్గాలతో మాట్లాడి కేసును క్లోజ్ చేయించాడు. కానీ కేసు మూసేసిన తర్వాత కూడా బాధితులకు బంగారం ఇవ్వకుండా.. తీసుకెళ్లి తాకట్టు పెట్టుకున్నట్టు విచారణలో తేలింది. విషయం పైస్థాయికి చేరడంతో అతడిపై కేసు నమోదు చేసి, సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతటితో ఆగకుండా.. భానుప్రకాష్‌ మీద మరో పెద్ద షాకింగ్‌ ఆరోపణ వెలుగులోకి వచ్చింది. తనకు కేటాయించిన 9MM సర్వీస్‌ పిస్టల్‌ కనిపించడంలేదని ఇటీవల స్టేషన్‌కు వచ్చి గోల చేశాడు. అతని డ్రా చెక్ చేయగా బుల్లెట్లు మాత్రమే కనిపించాయి. గన్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. సీసీ కెమెరా ఫుటేజీని చెక్ చేస్తే.. రికవరీ చేసిన బంగారాన్ని డ్రాలో పెట్టి తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా లభించాయి. అయితే గన్ సంగతి అడిగితే.. డ్రాలోనే పెట్టా, ఏమైందో తెలియడం లేదని అని భాను ప్రకాష్‌ విచారణలో చెబుతున్నట్టు సమాచారం. ఇదిలావుంటే, విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెట్టింగ్ వ్యసనానికి అలవాటు పడ్డ భాను ప్రకాష్ దాదాపు రూ.70–80 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులతోనే భానుప్రకాష్‌ ఈ అక్రమాలకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. ఈ లోపే ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ఉద్యోగం వచ్చిందని స్టేషన్‌కు వచ్చి చెప్పి, వస్తువులు తీసుకెళ్లిన సందర్భంలోనే పిస్టల్‌ మిస్సింగ్‌ కథ వెలుగులోకి వచ్చింది. ఈ గన్‌ను రాయలసీమ లేదా ఇతర ప్రాంతాల ముఠాలకు అమ్మేశాడా? అన్న కోణంలో టాస్క్‌ఫోర్స్‌ ప్రత్యేక దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రస్తుతానికి రికవరీ సొత్తు దుర్వినియోగంపై భానుప్రకాష్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పిస్టల్‌ మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు..!!

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :