Abhi9 News - తెలంగాణ / వనపర్తి : డ్రక్స్ కు యువత బానిస కావద్దని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దుని వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్ పి షాకీర్ హుస్సేన్ అన్నారు.అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి బాయ్స్ గ్రౌండ్స్ వరకు కొనసాగింది . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం సంతోషంతో మొదలై దుఃఖంతోనే అంతమౌతుందని అన్నారు.తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అనునిత్యం దృష్టిపెట్టాలని ప్రవర్తనలో మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తు సరైన మార్గ నిర్దేశం చేయాలని సూచించారు. డ్రగ్స్ కు అలవాటు పడిన తర్వాత బాధపడితే ప్రయోజనం లేదని భవిష్యత్తు ను అందకారంలోకి నెట్టిన వారవుతారని అన్నారు. మెదడు, నరాల వ్యవస్థ దెబ్బతిని శాశ్వత మానసిక వైకల్యం వచ్చే అవకాశాలుంటాయని అన్నారు.మాదకద్రవ్యాలు అమ్మడం, సేవించడం రెండు నేరమని అన్నారు.నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ 1985 ప్రకారం శిక్షార్హులు అవుతారని అన్నారు. చట్టాలు బలంగా ఉన్నాయని తర్వాత బాధపడి లాభం లేదని అన్నారు. పోలీస్ శాఖ జిల్లాలో డ్రగ్స్, గంజా నివారణ పట్ల యువతకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.2023 సంవత్సరంలో వనపర్తి జిల్లా లో గంజాయి కి సంబంధించి 01 కేసు నమోదు అయ్యింది ఇందులో 01 రిని అరెస్టు చేయడం తో పాటు 200 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం వనపర్తి జిల్లాలో గల కళాశాల స్టూడెంట్స్ తో ప్రమాణం చేయించారు
Admin
Abhi9 News