Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోనే మహబూబ్ నగర్ జిల్లా బాగుపడిందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినా పాలమూరులో వలసలు ఆగలేదు కదా మరిన్ని పెరిగాయని ఆరోపించారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ BRS ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓట్లు దగ్గరకు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కు.. కెటిఆర్ కు పాలమూరు గుర్తుకు వస్తుందని అన్నారు. పాలమూరు జిల్లాలో రెండు సార్లు పర్యటించిన తండ్రి కొడుకులు గొప్పలు గప్పాలు చెప్పుకున్నారు తప్ప చేసిందేమీ లేదని ఆమె అన్నారు. ఇక్కడ వలసలు ఆగి పోయాయని అబద్దం చెబుతున్న తండ్రీ కొడుకులకు....రోజూ ముంబై కీ వెళుతున్న బస్సు చూడటానికి రమ్మని ఆహ్వానిస్తే మాత్రం కేసీఆర్, కేటియర్ కు టైమ్ లేదని డీకే అరుణ ఎద్దేవా చేశారు. పాలమూరులో నాలుగు పాత ప్రాజెక్టులతో పాటు పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టు పనులను చూస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా వుందినీ, కోయిల్ సాగర్ లోని కాల్వలు నేటి వరకు మరమ్మత్తులకు నోచుకోలేదని ఆమె మండిపడ్డారు.
Admin
Abhi9 News