Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : రాష్ట్రంలో జ రుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై గులాబీ గూటికి వలసలు వస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పురు మండలం వెల్కిచర్ల గ్రామానికి చెందిన బిజెపి,కాంగ్రెస్ పార్టీలకు చెందిన రఘు,సాయినాథ్,పాండు,బాలు గారితో పాటు 100 మంది యువకులు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది. రైతులు, ప్రజల కోసం మంచిగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ను మరోసారి గెలిపించుకుంటామని వారు తెలిపారు.
Admin
Abhi9 News