Saturday, 13 June 2026 05:00:01 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

దేవసూగూర్ వీరభద్ర స్వామిని దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

Date : 18 June 2023 06:53 PM Views : 171

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవసూగూర్ సుగురేశ్వర వీరభద్ర స్వామి దేవాలయాన్ని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి మంత్రి దేవసూగూర్ చేరుకున్నారు. దేవాలయం ఆవరణలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం అమావాస్య రోజు ఇక్కడ పూజలు చేయడం ఎంతో ప్రత్యేకమని పూజారులు ఈ సందర్భంగా తెలిపారు. దేవాలయం విశిష్ఠతను పూజారులు మంత్రికి మంత్రికి వివరించారు. అనంతరం సమీపంలోనే ఉన్న నాగర ఎల్లమ్మ దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వెంట మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జేపీఎన్సీ కళాశాలల చైర్మన్ కె ఎస్ రవికుమార్ ఉన్నారు.

తెలంగాణ ఆర్టీసీ బస్సులు దేవసూగూర్ లో నిలపాలి కర్ణాటక ఆర్టీసీ బస్సులన్నీ రాయచూరు నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో దేవసూగూర్ దేవాలయం వద్దకు వస్తున్నాయని... కానీ తెలంగాణ ఆర్టీసీ బస్సులు మాత్రం రావడం లేదని భక్తులు, పూజారులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి అక్కడి నుంచే ఆర్టీసీ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ తో మాట్లాడి తప్పనిసరిగా తెలంగాణ నుంచి రాయచూరు వైపు వెళ్లే ప్రతి బస్సు దేవసూగూర్ దేవాలయం వద్దకు వచ్చి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీసీ అధికారుల తీరు వల్ల కార్పొరేషన్ ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో కూడా తాను ప్రత్యేకంగా మాట్లాడుతానని మంత్రి వివరించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :