Saturday, 13 June 2026 04:59:56 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

రూర్బన్ పథకం కింద గండీడ్ మండలంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి... జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్

Date : 13 July 2023 05:11 PM Views : 180

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : రూర్బన్ పథకం కింద గండీడ్ మండలంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సమయంలోని తన ఛాంబర్ లో పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డితో కలిసి గండీడ్ మండలంలో చేపట్టిన రూర్బన్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ఇంకా మొదలుపెట్టని పనులను వెంటనే ప్రారంభించాలని, పురోగతిలో ఉన్న పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు . మొదలుపెట్టని పనులలో విద్యుత్ కనెక్షన్లు, ఉద్యాన పందిళ్లు ,పంచాయతీరాజ్ ,టి ఎస్ ఈడబ్ల్యుసి కి సంబంధించిన పనులు పెండింగ్ లో ఉన్నాయని, సంబంధిత శాఖ ఇంజనీరింగ్ అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న విద్యుత్ కనెక్షన్లను వెంటనే ఇప్పించాలని, అలాగే వ్యవసాయ మోటార్లను విద్యుదీకరించాలని ఆదేశించారు. పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ గోదాము,దాల్ మిల్, విద్యుత్ కనెక్షన్లు, ఇటీవల ప్రారంభించిన మిల్క్ చిల్లింగ్ సెంటర్లో సదుపాయాల కల్పనను వెంటనే పూర్తి చేయాలని కోరారు. అలాగే ఈ- పంచాయతీకి సంబంధించి అవసరమైన సిస్టమ్స్ ని ఏర్పాటు చేయాలని అన్నారు.కష్టం హైరింగ్ సెంటర్లకు లబ్ధిదారులను గుర్తించి సాధ్యమైనంత త్వరగా వాటిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. డి ఆర్ డి ఓ యాదయ్య,ఆటవిశాఖ అధికారి సత్యనారాయణ, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, రెడ్కో డిఎం, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిడి, పంచాయతీరాజ్ ఈ ఈ, మార్కెటింగ్ శాఖ ఇంజనీర్, ఎలక్ట్రిసిటీ డి ఈ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :