Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు ఇంకా స్థలాలు గుర్తించాల్సిన చోట ఎంత స్థలం అందుబాటులో ఉంటే అంతస్థలాన్ని తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ ఎం పి డి ఓ లను ఆదేశించారు. బుధవారం అయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఎంపీఓల తో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. టెండర్లు పిలిచి పనులు చేపట్టినచోట గ్రామపంచాయతీ భవనాలన్నింటిని త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా గ్రౌండ్ స్థాయి లో ఉన్న వాటిని బేస్మెంట్ స్థాయికి, బేస్మెంట్ స్థాయిలో ఉన్న వాటిని రూఫ్ స్థాయికి, రూప్ స్థాయిలో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు ఆదేశించారు. సంపదవనాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్దేశించిన అన్ని ఎకరాలలో సంపదవనాలు పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా కందకాల తవ్వకాని సైతం వేగవంతం చేయాలని చెప్పారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలను పరిపూర్ణ స్థాయిలో పూర్తి చేయాలన్నారు . ఉద్యాన పంటలకు లబ్ధిదారులను గుర్తించడం పూర్తిచేయాలని, వైకుంఠ దామాలలో సోలార్ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలని, అలాగే 100% నీటి సౌకర్యం కల్పించాలని, స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా డెల్టా స్కోర్ కు సంబంధించి గ్రామపంచాయతీ తీర్మానంతో పాటు, ఒక నిమిషము వీడియోను సమర్పించాలని ఆదేశించారు. డిఆర్డిఓ యాదయ్య,డిఎఫ్ఓ సత్యనారాయణ, డిపిఓ వెంకటేశ్వర్లు, జెడ్పిసిఈఓ జ్యోతి, పంచాయితీరాజ్ ఈ ఈ నరేందర్ రెడ్డి ,మిషన్ భగీరత ఈ ఈ పుల్లారెడ్డి, ఏపీడి జకీయా సుల్తానా, ఎంపీడీవోలు, ఎంపీఓలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Admin
Abhi9 News