Abhi9 News - తెలంగాణ / వనపర్తి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల భాగంగా అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని వనపర్తి కలెక్టరు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీ లోకనాథ్ రెడ్డి వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందాలల్ జిల్లా ఎస్పీ కే. రక్షిత మూర్తి, పోలీస్ అధికారులు, సిబ్బంది తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం భవన ప్రాంగాణములో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్థూపం ముందు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కే సి ఆర్ సారథ్యంలో నేడు దేశం లోనే తెలంగాణ పోలీసులు అన్ని విభాగాల్లో ముందున్నారన్నారు. ముఖ్యంగా తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. తెలంగాణ పోలీసులు ప్రజల శాంతిభధ్రతలను కాపాడటానికి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. దేశంలోనే తెలంగాణ సేఫెస్ట్ ప్లేస్ గా ఉందన్నారు. అమరవీరులకు నివాళులు అర్పించిన వారిలో జిల్లా అన్ని శాఖల అధికారులతో పాటు పోలీస్ అధికారులు సిబ్బంది తడితురులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News