Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : వృద్ధులు,దివ్యాంగుల సమస్యలను జాప్యం చేయకుండా సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. స్థానిక అర్భన్ తహశీల్దార్ కార్యాలయంలో ప్రతి నెల మొదటి బుధవారం జరిగే వృద్ధుల,దివ్యాంగుల ప్రజావాణి కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వలన రెండో బుధవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని 32 మంది ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలా మొదటి బుధవారం తహశీల్దార్ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సంబంధింత అధికారులతో సమస్యలు తప్పక పరిష్కారమవుతాయని కలెక్టర్ భరోసా కల్పించారు. ఈ సంధర్భంగా ఒక వయో వృద్ధుడు తన కుమారుడు తనను ఇంటి నుండి గెంటేశాడని,తనను ఆదుకోవాలని కోరాడు.ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అర్హులైన దివ్యాంగులకు 5 శాతం కేటాయించాలని, డబుల్ బెడ్ రూం ఇళ్ళను కేటాయించాలని,ఆసరా పెన్షన్లను మంజూరు చేయాలని, పట్టణంలో దివ్యాంగులు చిరు వ్యాపారం చేసుకోవడానికి అర్జీ పెట్టుకుంటే మున్సిపల్ అధికారులు స్థలం లేదా షాపులు కేటాయించాలనే తదితర సమస్యల వినతీ పత్రాన్ని దివ్యాంగులు సమర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి జరీనా బేగం, నగరపాలక సంస్థ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఆర్డీవో నవీన్, అర్భన్ తహశీల్దార్ ఘాన్సీరాం, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్ష,కార్యదర్శులు జగపతిరావు, నస్కంటి నాగభూషణం, కోటేశ్వర్ రెడ్డి,అంజయ్య చారి, తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News