Saturday, 18 April 2026 05:15:37 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

సంక్షేమ వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే

Date : 20 June 2025 07:13 PM Views : 169

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ పట్టణంలోని కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న ఎస్సీ, బిసి సంక్షేమ బాలికల వసతి గృహాలను గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ కు వచ్చే విద్యార్థినులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన హాస్టల్ అధికారులను ఆదేశించారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలోని మెప్మా కార్యాలయంలో ఆర్పీలకు ఉచితంగా అందిస్తున్న కంప్యూటర్ శిక్షణ సెంటర్ ను , ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా కళాశాలలోని అన్ని తరగతి గదులను తిరిగి పరిశీలించారు. జూనియర్ కళాశాల భవనం కోసం ఆర్ అండ్ బి అధికారులతో సంప్రదించి వెంటనే ఎస్టిమేట్స్ ను తయారు చేయించాలని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ను ఎమ్మెల్యే గారు సందర్శించారు, ఒకేషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులతో ఆయన మాట్లాడారు. సమయం చాలా విలువైనదని , సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. టెక్నికల్ ట్రేడ్ లు చేసిన వారికి ఉపాధి అవకాశాలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ వినోద్ కుమార్, ఐఎన్టీయుసి రాములు యాదవ్, ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవంతాచారి, ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ భగవాణి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :