Thursday, 08 January 2026 03:10:09 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

సంక్షేమ వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే

Date : 20 June 2025 07:13 PM Views : 83

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ పట్టణంలోని కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న ఎస్సీ, బిసి సంక్షేమ బాలికల వసతి గృహాలను గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ కు వచ్చే విద్యార్థినులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన హాస్టల్ అధికారులను ఆదేశించారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలోని మెప్మా కార్యాలయంలో ఆర్పీలకు ఉచితంగా అందిస్తున్న కంప్యూటర్ శిక్షణ సెంటర్ ను , ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా కళాశాలలోని అన్ని తరగతి గదులను తిరిగి పరిశీలించారు. జూనియర్ కళాశాల భవనం కోసం ఆర్ అండ్ బి అధికారులతో సంప్రదించి వెంటనే ఎస్టిమేట్స్ ను తయారు చేయించాలని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ను ఎమ్మెల్యే గారు సందర్శించారు, ఒకేషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులతో ఆయన మాట్లాడారు. సమయం చాలా విలువైనదని , సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. టెక్నికల్ ట్రేడ్ లు చేసిన వారికి ఉపాధి అవకాశాలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ వినోద్ కుమార్, ఐఎన్టీయుసి రాములు యాదవ్, ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవంతాచారి, ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ భగవాణి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :