Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : దేవరకద్ర నియోజకవర్గం బండర్ వల్లి చెక్ డ్యామ్ లో సంవత్సరం పోడవున ( 365 రోజులు) నీరు నిల్వ ఉండడంతో రెండు పంటలకు సాగునీరు అందుతుంది దేవరకద్ర నియోజకవర్గంలో చెక్ డ్యామ్ ల నిర్మాణం వల్ల పెరిగిన భూగర్భ జలాలు,బోర్లు రిచర్జ్ అయ్యాయి కొత్తగా సాగులోకి వ మహాబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం బండ్రవల్లి గ్రామం లో పాత బ్రిడ్జి ను వృధాగా పోనివ్వకుండా కేవలం 60 లక్షల నిధులతో చెక్ డ్యామ్ ను నిర్మించడం వల్ల దాదాపు 2 కిలోమీటర్ల మేర 365 రోజులు నీళ్ళు నిల్వ వుంటుంది. రైతాంగం రెండు పంటలను సంతోషంగా పండించుకుంటున్నారు. వాగు పరిసర ప్రాంతాల భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయి... 2018 లో మంత్రి హరీష్ రావు గారి నారాయణ పేట పర్యటన లో భాగంగా మార్గ మధ్యలో వెళ్తున్న హరీష్ రావు గారికి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు బండ్ర వల్లి పాత బ్రిడ్జి ను చూపించడంతో వెంటనే నిధులు మంజూరు చేసి చెక్ డ్యామ్ ను నిర్మించుకోవడం జరిగింది. చెక్ డ్యామ్ నిర్మించడం వల్ల దాదాపు కొన్ని వేల ఏకరాలు అదనంగా సాగులోకి వచ్చాయి. దేవరకద్ర నియోజకవర్గం లో 30 చెక్ డ్యామ్ లు మంజూరు అవ్వగా ఇప్పటికీ 21 చెక్ డ్యామ్ లు నిర్మాణాలు పూర్తి అయ్యాయి. ఇంకా 9 చెక్ డ్యామ్ లు పనులు కొనసాగుతున్నాయి వర్షాలు కురుస్తున్న సందర్బంగా చెక్ డ్యామ్ లు నిండి పరవళ్ళు తొక్కుతున్నాయి....
Admin
Abhi9 News