Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జోగుళాంబ గద్వాల్ జిల్లా, వనపర్తి జిల్లాల నుండి ఎస్సై మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు ఎంపిక అయిన అభ్యర్థులకు వెరిఫికేషన్ ప్రక్రియ ఈ రోజు నూతన జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రారంభం కాగా జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన పోలీస్ అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌక్యరానికి గురికాకుండా మరియు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ వేగంగా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.TSLPRB నియమ నిబంధనల ప్రకారమే ఈ ప్రక్రియ జరుగుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు. రెండు జిల్లాల పరిధిలో మొత్తం 500 మంది అభ్యర్థులకు గాను 424 మంది అభ్యర్ధులు హాజరుకాగ వారి ధ్రువపత్రాలను పరిశీలించడం జరుగుతుందని ఇందుకోసం మొత్తం 8 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని. ఈ ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తు ఫారంలో తెలిపిన విధంగా అభ్యర్థుల సంబంధించిన ఒరిజినల్ ధ్రువపత్రాలను అధికారులు పరిశీలిస్తారనీ. అలాగే దరఖాస్తు చేసుకోనే ఏదైనా తప్పులు నమోదు చేసినట్లయితే వాటిని తిరిగి సరిద్దిదుకునేందుకుగాను తెలంగాణ పోలీస్ నియమాకాల బోర్డు అభ్యర్థులకు అవకాశం కల్పించడం జరిగింది అని జిల్లా ఎస్పీ అన్నారు.ఈ పరిశీలన కార్యక్రమములో ఏ. ఓ సతీశ్ కుమార్, సాయుధ దళ డి. ఎస్పీ శ్రీ ఇమ్మనియోల్ , సుపెరిండెంట్స్ నయీం , ఐటీ సెల్ ఎస్సై రజిత పాటు పరిపాలన విభాగం అధికారులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.
Admin
Abhi9 News