Thursday, 08 January 2026 02:41:45 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

అధికారులు ఇసుక సీజ్ చేస్తే.. మేము తరలిస్తామంటున్న ఇసుక మాఫియా

కృష్ణ మండల పరిధిలోని కాన్ దొడ్డి శివారులో ఉన్న అంజప్ప ఇటుక బట్టీలో లింగప్ప అనే వ్యక్తి రెండు ట్రిప్పర్లతో ఇసుక డంపు చేశాడు. ఈ విషయం రెవెన్యూ సిబ్బంది

Date : 23 September 2025 07:32 PM Views : 136

Abhi9 News - తెలంగాణ / Hyderabad : అధికారులు ఇసుక సీజ్ చేస్తే.. ఇసుక మేము తరలిస్తామంటూ ఇసుక మాఫియా రెచ్చిపోతున్న సంఘటన కృష్ణ మండల పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సాధారణంగా ఇసుక అక్రమ రవాణా చేసి డంపులు చేస్తే రెవెన్యూ అధికారులు వాటిని సీజ్ చేసి ఇసుకకు వేలం వేసి, వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖాతాలో జమచేస్తారు. ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ. అయితే దీనికి విరుద్ధంగా కృష్ణ మండల పరిధిలోని కాన్ దొడ్డి శివారులో ఉన్న అంజప్ప ఇటుక బట్టీలో లింగప్ప అనే వ్యక్తి రెండు ట్రిప్పర్లతో ఇసుక డంపు చేశాడు. ఈ విషయం రెవెన్యూ సిబ్బంది దృష్టికి వెళ్లడంతో ఆర్ఐ శ్రీనివాస్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని ఇసుక డంపులు సీజ్ చేశాడు. అయితే ఎవరైతే ఇసుక డంపు చేశారో వారిని కృష్ణ తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించుకొని ఇసుక డంపు తీసుకెళ్లాలంటే 50వేల రూపాయలు ఫైన్ కట్టి ఇసుక తీసుకెళ్లాలని తాసిల్దార్ సూచించారు. అయితే ఇసుక మాఫియా మాత్రం రాత్రికి రాత్రి సీజ్ చేసిన ఇసుకను ట్రిప్పర్ల ద్వారా ఇసుక తరలించి మీరు సీజ్ చేస్తే మేము ఇసుక తీసుకెళ్లలేమా అంటూ రెవెన్యూ సిబ్బందికి సవాలు విసురుతున్నారు. ఈ విషయంలో కృష్ణ రెవెన్యూ సిబ్బంది హస్తంతోనే అక్రమ ఇసుక తరలించారని పలువురు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కృష్ణ తహసీల్దార్ శ్రీనివాసులును పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :