Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీ కి బుద్ధి చెప్పాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం కేంద్రంలోని రైతు వేదిక దగ్గర రైతుబంధు సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన సమావేశంలోఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తు దేశంలోనే మన రాష్ర్టంలో అత్యధిక పంట దిగుబడి చేస్తున్నాం అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు,రైతు బంధు లాంటి అద్భుతమైన పథకాలు ప్రవేశ పెట్టడం జరిగింది అని నాడు కాంగ్రెస్ పాలనలో రైతులు ఇ బ్బంది పడ్డారని అన్నారు.రైతులు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి మండల ప్రజా ప్రతినిధులు, రైతు బంధు నాయకులు, కార్యకర్తలు రైతులు తదితరులు బారిగా పాల్గొన్నారు...
Admin
Abhi9 News