Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. మణిపూర్ లో క్రైస్తవులపై జరిగిన దాడికి నిరసనగా జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు నాలుగు వేల మంది వరకు క్రైస్తవులు పాల్గొన్నారు.ర్యాలీకి జిల్లా BRS అధ్యక్షుడు,గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,జడ్పీ చైర్ పర్సన్ సరిత మద్దతు తెలిపారు..
Admin
Abhi9 News