Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మక్తల్ నియోజకవర్గం నర్వ మండలానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య క్రీడలు మరియు యువజనుల శాఖ మంత్రివర్యులు గౌ" శ్రీ డా" వాకిటి శ్రీహరి గారికి ఘనంగా డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికిన నర్వ మండల కాంగ్రెస్ శ్రేణులు నర్వ మండల కేంద్రంలోని స్థానిక ఆంజనేయ స్వామి, రామాలయం గుల్లో మొదట పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీగా బయలుదేరి వాల్మీకి మహర్షి గారికి, జాతిపిత మహాత్మా గాంధీ గారికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి చాకలి ఐలమ్మ గార్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన గౌరవ మంత్రివర్యులు అనంతరం ర్యాలీగా బయలుదేరి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోనర్వ మండలనికి చెందిన 152 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను, 11 మంది కి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన గౌరవ మంత్రివర్యులు నేను ఈరోజు ఇక్కడ మీ ముందు నిలబడి మాట్లాడుతున్న అంటే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించేటందుకు పనిచేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను మంత్రిగా మీ ముందు నిలబడ్డాను అంటే అది మీ పుణ్యమే అని ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారు అన్నారు ఇట్టి కార్యక్రమంలో నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు, జెడ్పిసిఓ గారు, నర్వ మండల ఎంపీడీవో ఎమ్మార్వో, పలు శాఖల అధికారులు మరియు నర్వ, మరికల్ మండలాల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Admin
Abhi9 News