Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఆర్టిసి కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదంటూ బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిపిసిసి స్పోక్ పర్సన్ హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు పిఆర్సి ఇవ్వడం లేదని 30 ఏళ్లగా పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికుల జీతం 40 వేల లోపల ఉంటుందని అన్నారు.పన్నెండు డి ఎ లు కార్మికులకు ప్రభుత్వం బాకాయీ ఉందనీ అన్నారు.మహిళ కండక్టర్లు అర్ధరాత్రి వరకు కూడా పనిచేస్తున్నారని ఆయన అన్నారు...
Admin
Abhi9 News