Abhi9 News - తెలంగాణ / వనపర్తి : వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో ని ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్థన సమయానికి రాని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులకు రోజు క్రమ శిక్షణ కు సంబంధించిన విషయాలను వివరిస్తూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు.
Admin
Abhi9 News