Abhi9 News - తెలంగాణ / Hyderabad : ఆర్ధికంగా అభివృద్ధి సాదించిన అమెరికా, లండన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, స్వీడన్, నార్వే, స్పెయిన్, సింగపూర్, దుబాయ్, బీజింగ్ లాంటి పట్టణాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, సాంకేతికంగా నిర్వహించే డ్రోన్ షో తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగాత్మంగా దేశంలో మొట్టమొదటి సారిగా జులై 23 వ తేదీన సాయంత్రం 6 గంటలకు మహబూబ్ నగర్ పట్టణం లోని ట్యాంక్ బండ్ పై నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఏర్పాటు సమయంలో నిర్వహించిన డ్రోన్ షో ను జిల్లాల్లో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర IT, పరిశ్రమల శాఖల మంత్రి KTR గార్ల సహకారం తో ప్రపంచం లోని ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలలో అత్యంత అరుదుగా నిర్వహించే డ్రోన్ షో తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు లో భాగంగా దేశంలో మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ పట్టణం లోని ట్యాంక్ బండ్ పైన ఈ నెల 23న నిర్వహిస్తున్నామని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ సందర్భంగా వెల్లడించారు. మహబూబ్నగర్ పట్టణం లో డ్రోన్ షో నిర్వహించిన అనంతరం దశలవారీగా వివిధ జిల్లా లైనా వరంగల్, సిద్దిపేట, ఖమ్మం & నిజామాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్నట్లు మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామాయ్యర్ గారితో కలిసి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మి , టూరిజం డైరెక్టర్ శ్రీమతి నిఖిల, పర్యాటక శాఖ ఎండి మనోహర్, Botlan Dynamics స్టార్ట్ అప్ కు చెందిన ఆయుష్, భాస్కర్, పర్యాటశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News