Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం ద్వారా వాహన దారులకు,యజమానులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు.బుధవారం జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్ ఉప రవాణా కమిషనర్(DTC) కార్యాలయం ను సందర్శించారు.డ్రైవింగ్ ట్రాక్ ను పరిశీలించారు.డ్రైవింగ్ ట్రాక్ ను ఆధునీకరణ చేయాలని సూచించారు. జప్తు చేసిన వాహనాలు పరిశీలించి వాటిని ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తు దారులు వేచి ఉండు గది ని సందర్శించారు.అక్కడ వివిధ పనులకు వచ్చిన దరఖాస్తు దారులతో ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం లో సేవలు గురించి తెలుసుకున్నారు.అనంతరం రవాణా శాఖ అధికారులతో స్కూల్ బస్సుల ఫిట్ నెస్ జారీ,తనిఖీలు,కేసుల వివరాలు సమీక్షించి తనిఖీ లు నిర్వహించాలని, ఫిట్ నెస్ లేని వాహనాల పై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.సమావేశంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం. కిషన్,అర్. టి. ఓ రఘు కుమార్,ఎం.వి. ఐ వాసుదేవ రావు తదితరులు ఉన్నారు
Admin
Abhi9 News