Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పురు మండలం అన్నసాగర్ గ్రామంలో ఆర్ అండ్ బి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నియోజకవర్గంలోని పెండింగ్ లో ఉన్న పనులు వెంటనే పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం వచ్చింది కనుక నిర్మాణంలో ఉన్న వర్నె ,జంగమయా పల్లి,మదనాపూర్,వడ్డేమాన్, చిన్నచింతకుంట లో బ్రిడ్జ్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. బిటి రెన్యూవల్ రోడ్లు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. దేవరకద్ర ఆర్వోబి సర్వీస్ రోడ్లు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు ఈఈలు స్వామి , దేశయ్య డీఈఈలు నరేందర్,దానయ్య సంధ్య గా ఏఈ శ్రీ రాం, నాగరాజు పాల్గొన్నారు..
Admin
Abhi9 News