Saturday, 13 June 2026 05:29:50 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

నా భూమిని కబ్జా చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు..నాకు న్యాయం చేయండి..

Date : 18 August 2023 04:06 PM Views : 444

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్నగర్ జిల్లా, హన్వాడ మండల పరిధిలోని , టంకర గ్రామం ,బ్యాత్నమోని అనంతయ్య, తండ్రి బి .వెంకటయ్య, గ్రామం టంకర , వాసి అయిన తన భూమి సర్వే నంబర్లు 115 ఉ1,115ఉ2, 115/1/2/1/2, ఎందు మొత్తము (ఒక ఎకరా 22 గుంటలు) కలదని అట్టి భూమి , నేను బ్రతకడానికి వేరే ప్రాంతంలో ఉన్న సమయంలో మా సొంత అన్నయ్య బ్యాత్నమోని అంజిలయ్య తండ్రి బి.వెంకటయ్య, గ్రామం టంకర వాసి అయిన వారు ,నా యొక్క భూమిని కబ్జా చేసుకుని దాదాపు ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ,అడగడానికి వెళితే నీది ఎక్కడి భూమి , భూమి లేదు గీమి లేదు వెళ్ళిపో, అంటూ దౌర్జన్యంగా మా అన్నయ్య , మరియు వారి పిల్లలు నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ భూమి యొక్క పాసు పుస్తకము నా దగ్గర ఉన్నదని మరియు ఈసీ ,కాస్ర పహాని,తదితర అన్ని కాగితాలు తన వద్ద ఉన్నాయని ,అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు వేస్తున్న రైతుబంధు కూడా ప్రతి సంవత్సరం తన ఖాతాలో పడతా ఉన్నదని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న రెండు వేల రూపాయలు తన ఖాతాలో పడుతున్నాయని తెలియజేశారు . ఈ విషయమై స్థానిక మండల అధికారులు ,జిల్లా అధికారులు, స్పందించి తనకు న్యాయం చేయాలని అనంతయ్య అధికారులను కోరారు. ఈ విషయమై మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవడానికి వెళుతున్నానని, నాపై దయ ఉంచి జిల్లా , మరియు మండల అధికారులు స్పందించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు..

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :