Thursday, 08 January 2026 02:32:44 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు సమాంతరంగా అభివృద్ధి చెందాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ కు బహుమతి గా ఐఐఐటి కళాశాల ఇచ్చిన ముఖ్యమంత్రి ... అభివృద్ధి అంటే రోడ్లు, డ్రైనేజీ నిర్మించడం కాదు...

Date : 20 June 2025 07:11 PM Views : 72

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు సమాంతరంగా అభివృద్ధి చెందాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు పేర్కొన్నారు. మహబూబ్ నగర్ నగరపాలక పరిధి లోని తిరుమల హిల్స్ లో ప్రతిభ విద్యాసంస్థలు వారి మహంతి పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ అనిరుధ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన మహబూబ్ నగర్ కు ఎలాంటి వనరులు లేవని మనకు ఉన్న ఏకైక వనరులు మన జ్ఞానమే అని ఆయన చెప్పారు. మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పం మాకే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉందన్నారు. అందుకే మన మహబూబ్ నగర్ కు ఐఐఐటి కళాశాలను బహుమతి గా ఇచ్చారన్నారు. మహబూబ్ నగర్ ను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలపాలనే ఆలోచన ఎమ్మెల్యే లకే కాదు సామాన్య పౌరుడికీ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అకుంఠిత దీక్షతో పనిచేస్తే ఏదైనా సాధ్యమే అని ఆయన చెప్పారు. మన ఆలోచనల్లో మార్పు రావాలన్నారు. మన మహబూబ్ నగర్ పిల్లలు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ సాధించాలని ఆయన ఆకాంక్షించారు. చదువుతో పాటు కళలు, సాహిత్యం, క్రీడలు లలో మన మహబూబ్ నగర్ పిల్లలు రాణించాలని ఆయన అన్నారు. ప్రతిభా జూనియర్ కళాశాల విద్యార్థిని మంజుశ్రీ నీట్ ఎంట్రెన్స్ నందు ఆల్ ఇండియా లో 1902 ర్యాంకు సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే గారు ఘనంగా సన్మానించి అభినందించారు. అంతకుముందు జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ అనిరుధ్ రెడ్డి గారు మాట్లాడుతూ చదువు మీద ప్రత్యేక శ్రద్ధను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు చూపిస్తున్నారని, ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒప్పించి మహబూబ్ నగర్ జిల్లాకు ఐఐఐటి కళాశాల రావడానికి ప్రధాన భూమిక పోషించారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ , ఐఎన్టీయుసి రాములు యాదవ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జాజి మొగ్గ నర్సింహులు, మహతి పాఠశాల చైర్మన్ మంజుల దేవి, డైరెక్టర్లు వేంకటేశ్వర రెడ్డి, జనార్ధన్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :