Abhi9 News - తెలంగాణ / వికారాబాద్ : నారాయణపేట జిల్లా కోస్గి పట్టణ కేంద్రంలోని శివాజీ కోడలిలో ముదిరాజు సంఘం నాయకుల ఆధ్వర్యంలో నేడు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ...ముదిరాజ్ కులానికి చెందిన జర్నలిస్టును దుర్భాషలాడుతూ, ముదిరాజ్ కులాన్ని కించపరిచేటట్లు మాట్లాడిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని వెంటనే భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.రానున్న రోజుల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదని ,ఒకవేళ ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ సోదరులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఓడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు వేణుగోపాల్, తుడుం శ్రీనివాస్, వేణు, శేఖర్, బాలు, మరియు ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News