Monday, 05 January 2026 04:33:25 PM
# అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. # కొత్త సర్పంచ్‌లకు సీఎం గుడ్ న్యూస్..

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో దూకుడు.. సిట్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ సీరియస్ డైరెక్షన్స్‌

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణ స్పీడందుకుంది. ఫోన్‌ ట్యాపింగ్ కేసులో పూర్తి ఛార్జ్‌షీట్‌కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వ

Date : 22 December 2025 09:19 AM Views : 63

Abhi9 News - తెలంగాణ / Hyderabad : తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణ స్పీడందుకుంది. ఫోన్‌ ట్యాపింగ్ కేసులో పూర్తి ఛార్జ్‌షీట్‌కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ ఆదేశించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అందర్నీ ప్రశ్నించాలని సిట్‌కు డైరెక్షన్స్‌ ఇచ్చారు. దీంతో పోలీసుల ప్రత్యేక అధికారుల బృందం రంగంలో దిగింది. హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌.. వైడ్‌ యాంగిల్‌ ఎంక్వయిరీ చేపట్టింది. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో 9మంది సిట్‌ అధికారులతో సమావేశమయ్యారు సీపీ సజ్జనార్‌ .ఫోన్‌ ట్యాపింగ్ కేసులో పూర్తి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని ఆదేశించారు. కేసుతో సంబంధం వున్న అందర్నీ ప్రశ్నించాలన్నారు.ఇక రాజకీయ నేతలు,అధికారులను విచారించనుంది సిట్‌. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వున్న SIB మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావువిచారణ కొనసాగుతోంది. శనివారం జూబ్లీ హిల్స్‌ పీఎస్‌లో ఆయన్ని ప్రశ్నించారు సిట్‌ అధికారులు. ఇప్పటి వరకు ఏసీపీ,డీసీపీ, జాయింట్‌ సీపీ స్థాయి ఆఫీసర్లు విచారణలో పాల్గొన్నారు. ఐతే సోమవారం సీపీ సజ్జనార్‌ స్వయంగా ప్రభాకర్‌రావును ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఇకఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జూబ్లీహల్స్‌ పీఎస్‌లోనే ఎంక్వయిరీ జరుగుతుంది.త్వరలో సిట్‌కు ప్రత్యేక కార్యాలయం కేటాయించనున్నారని సమాచారం. ఇప్పటివరకు సాగిన దర్యాప్తులో అధికారులు పలుహార్ డిస్క్‌లుతో పాటు ఎలక్ట్రానిక్ డివైస్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ప్రభాకర్ రావు కి చెందిన ఫోన్లు లాప్టాప్ లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎఫ్ఎస్ఎల్ కు పంపించి డేటాను విశ్లేషిస్తున్నారు. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు..? ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి…? రికార్డ్ చేసిన డేటాను ఎక్కడైనా భద్రపరిచారా? లేదంటే ధ్వంసం చేశారా …? అనే అంశాలపై సిట్ అధికారులు ఫోకస్‌ పెట్టారు.ఇప్పటివరకు జరిగిన విచారణ ఒక ఎత్తు అయితే, కొత్త సిట్ జరిపే విచారణ మరో ఎత్తు. కొత్త సిట్ లో ఐపీఎస్ అధికారులు ఉండటం… టెలిఫోన్ టాపింగ్ నిబంధనల గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉండటంతో మెరికల్లాంటి అధికారులను సిట్ లో చేర్చారు. పూర్తి చార్జషీట్‌ దాఖలు చేయాలని సిట్‌కు డైరెక్షన్‌ ఇచ్చిన సీపీ సజ్జనార్‌ ఫోన్‌ ట్యాపింగ్‌తో సంబంధం వున్న అందర్నీ ప్రశ్నించాలని క్లియర్‌ కట్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇచ్చారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :